ఇండియన్ సినిమా చరిత్రలోనే స్టార్ హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి గురించి ఇండియా మొత్తం చాలా గర్వం గా చెప్పుకుంటున్నారు.ఇక ఇంతకుముందు ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్టామినా ఇంటి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మహేష్ బాబు పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహా భరతం సినిమాను ఎప్పుడు తీస్తాడు అని ఆయన అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇక దాని మీద కూడా రీసెంట్ గా రాజమౌళి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అది ఏంటి అంటే మహేష్ బాబు సినిమా అయిపోయిన వెంటనే తను మహాభారతం మొదలు పెట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి...  ఇక దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే రాజమౌళి తొందర్లోనే పెట్టే ప్రెస్ మీట్ లో మహేష్ బాబు సినిమాతో పాటు మహాభారతం సినిమాలకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహాభారతం సినిమా కనక రాజమౌళి తీసినట్లైతే వరల్డ్ లోనే అదొక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... చూడాలి మరి ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకు వెళుతారు అనేది...ఒక వేళ ఈ సినిమాను కనక తీస్తే దాని కోసం రాజమౌళి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: