నిజంగానే ఇది టాలీవుడ్కు పెద్ద పిడుగు లాంటి వార్త. ప్రతి యేడాది 200 సినిమాలు రిలీజ్ చేసే టాలీవుడ్ లో సినిమాలు లేక హీరోలు ఖాళీగా ఉండటం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఇది నిజం అని చెప్పాలి .. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. పెద్ద హీరోల వరకు ఓకే ... పెద్ద సినిమాలు చేసేందుకు పెద్దపెద్ద దర్శకలు పేరున్న దర్శకులు పెద్ద నిర్మాణ సంస్థలు రంగంలో ఉంటాయి. సినిమాకు యావ‌రేజ్ టాక్‌ వచ్చిన బాక్సాఫీస్ దగ్గర ఏదోలా పైసలు సొమ్ములు చేసుకోవచ్చన్న ఆశలతో పెద్ద బ్యానర్లు ఉంటాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ దేవర సినిమాకు బెనిఫిట్ షో అయిన వెంటనే చాలా మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. సినిమా యావరేజ్ కాదని ... బిలో యావరేజ్ అని రకరకాల రిపోర్టులు వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ తో పాటు ఏదోలా దేవర సినిమాను గట్టి ఎక్కించారు. ఆ స్టామినా టాలీవుడ్ లో అందరి హీరోలకు ఉండదు.


ఎన్టీఆర్ - బన్నీ - మహేష్ లాంటి హీరోలను పక్కన పెడితే చివరకు ప్రభాస్ లాంటి హీరోలు చేసిన కొన్ని సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవటం లేదు. మహేష్ గుంటూరు కారం సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. 80 % - 90 % రికవరీ మాత్రమే పెద్ద సినిమాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు చూసి ఎందుకు ప్రేక్షకులు అస్సలు థియేటర్లలోకి రావటం లేదు. ఇప్పటికే ముగ్గురు వందల గురించి చిన్న మిడిల్ రేంజ్ హీరోలు ఖాళీగా కూర్చున్నారు. కనీసం మరో నలుగురు ఐదుగురు ఖాళీగా కూర్చునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. రవితేజ - గోపీచంద్ - సాయిధరమ్ తేజ్ - కళ్యాణ్ రామ్ - నితిన్ లాంటి హీరోలు హిట్లు కొట్టి చాలా రోజులు అవుతుంది. అసలు వీళ్ళతో సినిమాలు చేసేందుకు కూడా ఏ సంస్థ ముందుకు రాని పరిస్థితి కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే తప్ప దియేటర్లకు వచ్చే సినిమా చూసి ఎందుకు ప్రేక్షకులు ఎవరు ఇష్టపడటం లేదు. అందుకే ఈ హీరోలతో సినిమా అనేది ఇప్పుడు పెద్ద జూదంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: