కోట శ్రీనివాసరావు మరణించడంతో ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ప్రముఖులతో పాటు ఇండస్ట్రీ లో ఉండే ప్రతి ఒక్క నటీనటులు ఆయనకు నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ఇక వెళ్లడానికి వీలుకాని మరికొంత మందేమో ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. అయితే కోటా శ్రీనివాసరావు మరణిస్తే ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.కానీ  బండ్ల గణేష్ చేసిన పని మాత్రం సోషల్ మీడియా అభిమానులకి కోపం తెప్పిస్తుంది.. ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దమనిషి చనిపోతే చిల్ అవుతున్నామంటూ బండ్ల గణేష్ పోస్ట్ పెడతారా అంటూ ఆయన పెట్టిన పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు మండి పడుతున్నారు. 

మరి ఇంతకీ బండ్ల గణేష్ చేసిన తప్పేంటి..ఎందుకు ఆయనపై విరుచుకుపడుతున్నారు అనేది చూస్తే.. కోట శ్రీనివాసరావు వృద్ధాప్యం కారణంగా గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం లేదు.అయితే హరిహర వీరమల్లు సినిమాలో ఓ చిన్న సీన్లో ఈయన కనిపిస్తారట. అయితే చాలా రోజుల నుండి కోట శ్రీనివాసరావు షూటింగ్స్ లో పాల్గొనక పోవడం వల్ల బయట కనిపించడం లేదు. దీంతో ఆయన ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు.కానీ బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి మరీ కలిసి ఆయనతో ఉన్న ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోతో కోటా శ్రీనివాసరావు ఎలా ఉన్నారో చూసి చాలామంది షాక్ అయిపోయారు.
అయితే అలాంటి బండ్ల గణేష్ కోట శ్రీనివాస రావు చనిపోయిన సాయంత్రానికి ఆయన అంత్యక్రియలు ముగిశాక చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాను అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు.అందులో ఉత్తేజ్,శ్రీకాంత్,శివాజీ రాజా, ఆలీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు అసలు బండ్ల గణేష్ కి దిమాక్ పని చేస్తుందా.. ఇండస్ట్రీలో ఉండే అంత పెద్ద మనిషి చనిపోతే ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని తలుచుకొని బాధపడుతుంటే ఈయన మాత్రం ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెడతారా.. అసలు ఈయనకి కోట శ్రీనివాసరావు అంటే కనీస మర్యాద కూడా లేదా.. అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: