టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా 'హనుమాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసి సంచలనం సృష్టించారు. ఆయన తదుపరి చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, ప్రశాంత్ వర్మ ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూసర్ల దగ్గర తమకే మొదట సినిమా చేస్తానంటూ అడ్వాన్స్ లు తీసుకుని, ఆ సినిమాలను చేయడం లేదన్నది ఆ వార్త సారాంశం. ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి స్పష్టత వచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని, తాము ప్రశాంత్ వర్మకు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని ఆ సంస్థ అధికారికంగా పేర్కొంది. అంతేకాకుండా, తమ మధ్య ఎలాంటి వ్యాపార ఒప్పందాలు జరగలేదని కూడా తేల్చి చెప్పింది. ఏదైనా వార్తను ప్రచారం చేసేముందు, నిజానిజాలు తెలుసుకోవాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతానికి, డివివి ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీతో ఈ వివాదంపై ఒక వైపు స్పష్టత వచ్చింది. అయితే, ఈ వార్తలపై మరియు ఆ సంస్థ ప్రకటనపై ప్రశాంత్ వర్మ ఏ విధంగా స్పందిస్తారో, అధికారికంగా ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. ఆయన వివరణ కోసం సినీ ప్రేక్షకులు మరియు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే, ప్రశాంత్ వర్మ స్పందన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి