రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ సినిమా మీద మొదటి రోజు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా హీరోయిన్గా బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా ఎంపిక కావడంతో ప్రాజెక్టుపై హైప్ మరింత పెరిగింది. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇటీవల విడుదలైన వారణాసి గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రాజమౌళి విజువల్స్, మహేష్ కొత్త స్టైల్ లుక్ చూసి “ఈ సినిమా మరో లెవెల్‌లో ఉండబోతోంది” అని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా జరిగిన ఈవెంట్‌లో రాకుమారిలా మెరిసిన ప్రియాంక చోప్రా అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. ఆమె లుక్ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. కానీ ఈ ‘మందాకిని’ పాత్రకు మొదటగా ప్రియాంక కాదు, మరొక స్టార్ బ్యూటీని రాజమౌళి, టీమ్ అనుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


హీరోయిన్ మరెవరో కాదు… అలియా భట్. ఇప్పటికే రాజమౌళితో ఆర్ఆర్ఆర్ లో ఆయనతో పని చేసిన అనుభవం ఉండటంతో ఈ కీలక పాత్రకు అలియా భట్ అద్భుతంగా సరిపోతుందని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నేరేషన్ కూడా పూర్తయ్యిందని, అలియా ఈ పాత్రలో కనిపిస్తే సినిమాలో మరో ఎక్స్‌ట్రా గ్లామర్ మరియు భావోద్వేగం రెండు ఉన్నాయి అని .. కానీ చివరి దశలో అలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కారణం — కాల్ షీట్లు. ఈ సినిమాకు కావలసిన లాంగ్ షెడ్యూల్స్, ప్రత్యేకంగా విదేశీ షూట్‌ల కోసం ఆమె దగ్గర క్లియర్ డేట్స్ లేవట. ఇప్పటికే సైన్ చేసిన మరో పెద్ద ప్రాజెక్ట్‌తో షెడ్యూల్‌లు క్లాష్ కావడంతో, ఎంత ప్రయత్నించినా రాజమౌళి టీమ్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేకపోవటంతో అలియా ‘మందాకిని’ పాత్రను వదులుకోవాల్సి వచ్చిందట.



అభిమానులు మాత్రం “మందాకిని పాత్రకు అలియా భట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేది” అని ఇంకా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో, ప్రియాంక చోప్రా వచ్చాక ఆ పాత్రకి మహత్తరమైన వయసు, గంభీరత, ఓ రాయల్ ఫీలింగ్ వచ్చిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా… అలియా భట్ రిజెక్ట్ చేసిన చోట ప్రియాంక చోప్రా రావడంతో వారణాసిపై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. మహేష్–ప్రియాంక కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: