మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ప్రెజెంటేషన్ పరంగా, యాక్షన్ డిజైన్ పరంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా పెద్ద మార్క్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఆగస్ట్ నెలలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు ఆ ప్లాన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలల్లో భారీగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు సమయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అందువల్లే రిలీజ్ డేట్ని కొంచెం ముందుకు జరపాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇన్ని మార్పులు జరుగుతున్నా, అభిమానుల్లో మాత్రం ఒక్క విషయం మీదే భారీ ఉత్సుకత— “టైటిల్ ఏమిటి? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఎలా రిలీజ్ చేస్తారు?” ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కాబట్టి ఎలాంటి టైటిల్ వచ్చినా అది మామూలు రేంజ్లో ఉండదని, ఇండస్ట్రీనే షేక్ చేసే స్థాయి టైటిల్ ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడైతే అందరి దృష్టి టైటిల్ అనౌన్స్మెంట్పై, తదుపరి షూటింగ్ షెడ్యూల్పై, అలాగే ఫైనల్ రిలీజ్ డేట్పై నిలిచింది. మరి ఈ మాస్ పాన్ ఇండియా కాంబినేషన్ నుంచి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి