టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చి బాబు సన్న దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అంచనాలను పెంచేసింది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ తో రామ్ చరణ్ RC -17 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అఫీషియల్ గా కూడా ప్రకటించారు చిత్ర బృందం.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అనే విషయంపై తాజాగా ఒక న్యూస్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది. 2026 మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేల డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. అయితే రామ్ చరణ్ మాత్రం పెద్ది సినిమా విడుదలైన తర్వాత ఒక రెండు నెలలు కుటుంబానికి కేటాయించి ఆ తర్వాత RC -17 సినిమా షూటింగ్ సెట్లో ఎంట్రీ ఇస్తారట. ఈ చిత్రానికి సంబంధించి ఫైనల్ స్క్రిప్టును కూడా డైరెక్టర్ సుకుమార్ లాక్ చేసినట్లుగా తెలిసింది.


ఆమధ్య డైరెక్టర్ రాజమౌళి కూడా సుకుమార్ తదుపరి సినిమాలోని హీరో ఎంట్రీ కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సినిమా స్టోరీ  రేంజ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. RC -17 సినిమాకి సంబంధించి నటీనటుల విషయాలను కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతోంది చిత్ర బృందం.డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో  వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది మొదటిలో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. అందుకే రామ్ చరణ్ పెద్ది సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: