ముఖ్యంగా దేవర పార్ట్ 1 విషయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను కొరటాల శివ సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది. మొదటి భాగం విడుదలైన తర్వాత సినిమా సెకండాఫ్పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, దేవర 2 కోసం కథను మరింత బలంగా మలిచినట్టు సమాచారం. పార్ట్ 1లో కొంతమందికి వీక్గా అనిపించిన ఎలిమెంట్స్ను పూర్తిగా మార్చి, ఈసారి స్ట్రాంగ్ సెకండాఫ్తో కథను డిజైన్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.కొరటాల శివ తన టీంతో కలిసి దేవర 2 కోసం ఒక పవర్ఫుల్ న్యారేషన్ను సిద్ధం చేసినట్టు, అది ఎన్టీఆర్కు వినిపించారట. అయితే ఈ కథపై జూనియర్ ఎన్టీఆర్ తుది నిర్ణయం ఏంటి? ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా? అన్నది ఇంకా అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ఈ విషయంలో ఎన్టీఆర్ రియాక్షన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.మొత్తానికి దేవర పార్ట్ 2 పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చేదాకా అభిమానుల ఎదురుచూపులు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి