ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచ నలు మూలల్లో ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా కూడా ఇక నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఇక టెక్నాలజీని బాగా వాడుకుంటూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇలా సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.



 ఇక ఇలా వెలుగులోకి వచ్చే వాటిలో కొన్ని వింతైన ఘటనలు కూడా ఉంటాయని చెప్పాలి. ఇక ఇలాంటి విషయాల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సాధారణంగా  తల్లి పై కోపం వచ్చినప్పుడు ఇక పిల్లలు అలగడం లాంటివి చేస్తూ ఉంటారు. రెండు మూడు రోజులు మాట్లాడటం మానేస్తూ ఉంటారు. కానీ తల్లిపై కోపంతో ఇక్కడ పిల్లాడు చేసిన పని మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కేలా చేస్తుంది. ఏకంగా 130 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు సదురు బాలుడు. ఈ ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది.


 తల్లి కోపగించుకోవడంతో మనస్థాపం చెందాడు ఆ బాలుడు. ఈ క్రమంలోనే తల్లి పై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాలి అనుకున్నాడు. అతనికి కేవలం సైకిల్ తొక్కడం మాత్రమే వచ్చు. దీంతో సైకిల్ పై బయలుదేరి ఏకంగా 150 కిలోమీటర్ల వరకు వెళ్ళాడు. ఇలా రోజంతా సైకిల్ తొక్కుతూ 130 కిలోమీటర్లు వెళ్లిన అమ్మమ్మ ఇల్లు మాత్రం రాలేదు. చివరికి అలసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నాడు.  ఇది గమనించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి చివరికి బాలుడిని అప్పగించారు అని చెప్పాలి. ఇక కొడుకు చేసిన పని గురించి తెలిసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: