మనుషులంటనే పూర్తిగా విలువ లేకుండా పోతుంది.అందులో భార్యభర్తల బంధమంటే మరీ చులకనై పోతుంది.తాళికట్టిన మొగుడంటే పెళ్లాంకు మెడలో అలంకరణగా మారగా,పెళ్లాం అంటే పడక గదిలోకి మాత్రమే పనికొచ్చే పశువుగా చూస్తున్నారు. ఇక కోపం వస్తే అరచుకోవడం,కొట్టుకోవడం,మరీ కాకపోతే విడాకులు తీసుకోవడం మాత్రమే మనకు తెలిసిన విషయం కాని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తన భార్యకు వెరైటీ టార్చర్ చూపించాడు.



అది ఎలాగంటే వారింట్లో మూత్రం పోయడానికి జాగా లేదన్నట్లు,భార్య ముఖం మీద పోసే వాడట.ఈ విషయాన్ని అతని భార్య ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకు ఈ ఘనుడి ఘనచరిత్ర ఏంటో తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్ లోని యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిస్థాయి పదవిలో పనిచేస్తున్న ఓ సీనియర్ అధికారి భార్య,తన భర్తపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది.తన భర్త తనను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించింది.ఈ విషయం పై ఆయన భార్య నీతు,ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిందట.అందులో తనపై జరుగుతున్న గృహహింసను ఆమె వివరించారట.



ఆ ఫేస్ బుక్‌లో మోదీకి పంపిన సమాచారంప్రకారం..నా భర్తనన్ను భయంకరంగా కొట్టడమేగాక చంపేస్తాననికూడా బెదిరిస్తున్నా రు.అది అతనిదగ్గర ఉన్న గన్‌చూపించి.అంతే కాకుండా ఏమగాడు చేయలేనంత నీచంగా నామీద మూత్రం కూడా పోస్తున్నాడు  నన్నే కాదు.మా అమ్మా నాన్నలను,నా సోదరులను కూడా చంపేస్తానని బెదిరిస్తున్నా రు.మాఆయన ఓబాధ్యత గల మంత్రి అయ్యివుండి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు అని.కేబినెట్ స్థాయిలో పనిచేస్తున్న బాబూరామ్ నిషాద్ అనే ఉద్యోగిపై ఆయన భార్య ఫిర్యాదు చేసారు.ఈ విషయం కొందరి అధికారుల దృష్టికి తీసుకెళ్లితే,ఈ వివాదాన్ని వ్యక్తిగతంగా పరిష్కరించు కోవాలని సూచిస్తున్నారు.ఇక ఈ విషయంలో ఫిర్యాదు చేసేందుకు చాలాసార్లు  ప్రయత్నించి విఫలం అయ్యానని,ప్రధాని మోదీ,సీఎం యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకొని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: