పరారీలో కార్తిక్ రాథోడ్ అనే వ్యక్తి ఉన్నారని, వీరి వద్ద నుండి 83 లక్షల 60 వేల విలువజేసే 650 కిలోల గంజాయి, ఒక మారుతి ఏర్టిగా, ఒక ఐచేరు వాన్, 10 మొబైల్స్, నగదు 60 వేల రూపాయల స్వాధీనం చేసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుండి జహీరాబాద్ కి సరఫరా చేస్తున్న ముఠా ని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఎర్తిగా వాహనాలు నుండి విశాఖపట్నం నుండి ఐషర్ వాహనం ద్వారా దీన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని, పక్కా సమాచారం తో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
ముఖ్యమైన నిందితుడు పాతాళ నగేష్ ని అరెస్ట్ చేసామని పేర్కొన్నారు. ఇతనిపై గతంలో ఏజెసి నుండి 350 కి గ్రామ్ కొనుగోలు చేసి, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్ కి సరఫరా చేస్తున్నారని, తీసుకొని ఎక్కడ కి అమ్ముతున్నారు అని ఆయన పేర్కొన్నారు వీరంతా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా కి చెందిన వారు అని సీపీ వివరించారు. 15 మంది నిందితులనుగతంలో అరెస్ట్ చేశామని, వారి పై పిడ్ యాక్ట్ నమోదు చేసామని ఫాస్ట్ ట్రక్ కోర్టు లో అప్పీల్ చేస్తామని తెలిపారు.