గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగకూడదనే పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది.ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.ఏపీలో 180 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని,పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షల వల్ల 20 మిలియన్ యూనిట్ల మేర భారం తగ్గుతుందని విద్యుత్తు శాఖా అధికారులు అంటున్నారు..వేసవి లో కరెంట్ వినియోగం పెరగడం వల్ల మరో 30 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు.
ఈ నెల చివరి వారం నుంచి కరెంట్ ను అదనంగా కొనుగోలు చెస్తామని సదరు అధికారులు అంటూన్నారు. ఇప్పుడు ఎపి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప కరెంట్ ను కట్ చేయమని అన్నారు. అర్బన్లో అరగట సేపు విద్యుత్ కోతలు విధిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉందని, అందుకే థర్మల్ పవర్ ప్లాంట్ ను కొనసాగిస్తున్నామని అన్నారు. అయితే థర్మల్ కు బొగ్గు కొరత ఉండటం వల్ల విద్యుత్ కొరత ఏర్పడినది అంటున్నారు..బొగ్గును కూడా వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చెస్తున్నట్లు అధికారులు అంటున్నారు..