కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో కూడా ఏపీలోని ప్రతిపక్షాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటాయి. ఆ విషయంలో తమిళనాడులో రాజకీయ పార్టీల మధ్య ఐక్యత అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ వైరిపక్షాలే అయినా, రాష్ట్ర సమస్యల విషయంలో మాత్రం అక్కడి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయి. అయితే ఏపీలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి వ్యవహారం లేదు. తాజాగా ప్రతిపక్షనేత చంద్రబాబు.. వైసీపీతో కలసి పనిచేస్తామంటున్నారు. జగన్ కూడా తమతో కలసి రావాలంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకునేందుకు ఉమ్మడి పోరాటం చేద్దామంటున్నారు బాబు.