ప్రేమ పేరుతో అమ్మాయిలని  ముగ్గులోకి దింపడం ... పెళ్లి పేరుతో లొంగదీసుకుని శారీరకంగా వాడుకుని ఆ తర్వాత రోడ్డుపై వదిలేయటం... ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో రోజురోజుకు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. మాయ మాటలతో నమ్మించి మోసగాళ్ల బారిన పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలు  కనిపిస్తే చాలు ప్రేమ పేరుతో  వల వేసి... జీవితాలను నాశనం చేస్తున్న దుర్మార్గులు  కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ ఇలాగే మోసపోయింది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కొన్ని  రోజుల వరకు శారీరక సుఖం పొందిన యువకుడు ఆ తర్వాత మహిళలను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. 

 

 

 వివరాల్లోకి వెళితే.. భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో ఉంటున్నా మహిళను  నమ్మించి మోసం చేసిన యువకుని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. ఈ మహిలకు  ఐదేళ్ల బాబు మూడు ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే ఈ మహిళ పై అనుమానం పెంచుకున్న భర్త తరచు అసభ్య పదజాలంతో తిడుతూ కొడుతూ  ఉండడం చిత్రహింసలకు గురి చేస్తుండటంతో గత మూడు నెలల నుండి  భర్త నుండి వేరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వచ్చి ఉంటుంది ఆ మహిళ. ఉత్తర ప్రదేశ్ బరేలీ కి చెందిన 19 ఏళ్ల అనే యువకుడు వంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే ఈ  ఇద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. 

 

 

 కాగా ఇటీవలే జోహార్ నగర్ లోని ఓ ఇంట్లో సదరు మహిళ పనికి కుదిరింది. దీంతో తరచూ ఆ  ఇంటికి వస్తూ ఆ మహిళను కలుస్తూ ఉండేవాడు ఆఫన్. ఈ క్రమంలోనే ఆ మహిళతో లైంగిక సంబంధానికి తెరలేపి ఎన్నో  రోజుల పాటు లైంగిక సంబంధాన్ని కొనసాగించాడు . అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ మహిళ పని చేస్తున్న ఇంటి యజమాని స్థానికులు యువకున్ని  నిలదీయడంతో  పెళ్లి చేసుకుంటానని తెలిపారు. ఇక ఆరోజు నుంచి ఆ యువకుడు ఆ మహిళను కలవడం మానేసాడు. ఫోన్ చేసినా ఎత్తడం లేదు.మహిళా  నుంచి తప్పించుకొని తిరుగుతుండడంతో మోసపోయానని గ్రహించిన మహిళ... శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: