ప్ర‌స్తుతం ఏపీలో కూడా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. సోమ‌వారం కొత్త‌గా 12 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో అక్క‌డ కేసుల సంఖ్య ఏకంగా 432కు చేరుకుంది. ఇక చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఓ వైసీపీ ఎమ్మెల్యే మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి బ్యాంకులు త‌నిఖీ చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంకులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. బ్యాంకులో గుంపులుగా జనాన్ని చూసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. 

 

బ్యాంకులో ప‌నుల కోసం వ‌చ్చే ఖాతాదారులు క‌నీసం రెండు మీట‌ర్ల దూరం పాటించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.500 జమ చేయడంతో వాటిని తీసుకోవడానికి ఖాతాదారులు క్యూ కట్టారు. ఇక ప్ర‌జ‌లు క‌నీసం రెండు మీట‌ర్ల దూరం పాటించేలా త‌గిన ఆగ్ర‌త్త‌లు తీసుకునేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్యే కోరారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: