మహిళ ల రక్షణ కోసం ఎన్నో చట్టా లను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధుల రాక్షసత్వాన్ని తీర్చు కుంటున్నారు.. పసికందు ల నుంచి పండు ముస లాల్ల వరకు వదలకుండా కామ దాహాన్ని తీర్చుbకుంటున్నారు..పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎందరో చని పోయారు.. నిర్భయ ,దిశ లాంటి ఎన్నో చట్టాలను అమలు లోకి తీసుకొచ్చిన కూడా మగ మృగళల్లో ఎటువంటి మార్పు రాలేదు..




 

వివరాల్లోకి వెళితే..నిత్యం దైవారాధన లో మునిగి తేలే పూజారి కీచకుడి గా మారాడు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపు లకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. తమిళనాడు లోని చెన్నై సమీపంలోని ఆరణి పరిధిలో గల దచ్చూర్‌కు చెందిన సుకుమార్ అనే వృద్ధుడు ఓదలవాడిలోని జెయినర్ ఆలయంలో సుమారు 25ఏళ్లుగా పూజారిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశచూపిన సుకుమార్‌ను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లాడు.




 

 

అలా చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు..చిన్నారి తాత అనే నమ్మకం తో అక్కడకు వెళ్ళింది.. అలా లోపలికి వెళ్ళగానే చిన్నారి దుస్తులను తొలగించి చేతులతో తాకుతూ..లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చిన్నారి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వృద్ధుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం దచ్చూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: