రోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. రహదారులన్నీ రక్తపు మాడుగుల తయారవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. అతివేగంగా ప్రయాణించడం వలన కొంత మంది చనిపోగా, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.  డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రిఫిక్ నియమాలు పాటించడం వలన ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రమాదంలో అవయాలు పోగొట్టుకొని దివ్యాంగులుగా మరి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టడంతో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగు చూసింది. సొంతూరు వెళ్లి తిరిగొస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా తక్కళ్లపాడ్ వద్ద చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లెకి చెందిన భార్యాభర్తలు టి.శ్రీనివాస్(40), సమత(35) వరంగల్‌లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే కొద్దిరోజుల కిందట సొంతూరు వెళ్లిన శ్రీనివాస్ దంపతులు బైక్‌పై వరంగల్‌కు తిరుగు ప్రయాణమైయ్యారు. ఇక మార్గం మధ్యలో వరంగల్ రహదారిపై ఒగ్లాపూర్ - తక్కెళ్లపాడ్ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న బైక్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య సమతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: