ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఏపీ ప్రజలకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కేసులు అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. అలాగే ఒక్క మరణం సంభవించింది.కరోనా మహమ్మారి బారిన పడి శుక్రవారం ఒక్కరు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా మహమ్మారి వల్ల మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,139కి చేరింది. కరోనా వైరస్ నిర్ధారణ తగ్గించగా, కేసుల సంఖ్య అత్యల్పంగా పడిపోయాయి.

ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 31,696 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 94 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,85,710కి చేరింది.రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగాయి. కరోనా మహమ్మారి నుంచి శుక్రవారం మొత్తం 232 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,76,372 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,199కు పడిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,25,14,639 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలిపింది.ఇక, శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 కరోనా కేసులు నమోదు కాగా, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక, విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 35 ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో కరోనా వైరస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో కరోనా వైరస్ విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: