ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగార్జునను ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఆధారంగా ఆమె నాగార్జున ను ప్ర్శనించింది. ‘మీరు త్వరలో తాత కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా?’ అని అడగగా.. నాగార్జున కొంచెం సేపు సైలెంట్ అయ్యి..ఒక చిరునవ్వుతో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం ఇప్పుడు హైలెట్ గా మారింది. "సరైన సమయం వచ్చినప్పుడు తానే అధికారికంగా ప్రకటన చేస్తానని చెప్పారు".
అంతే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాగార్జున ఇచ్చిన ఈ సమాధానంతో అక్కినేని కుటుంబంలో త్వరలోనే కొత్త ఏడాది సందర్భంగా ఒక వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. నిజంగా ఆమె ప్రెగ్నెంట్ కాకపోయుంటే నాగ్ సైలెంట్ అయిపోయేవాడు..లేకపోతే నో అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చేవారు. కానీ ఆయన స్మైల్ తో కూల్ గా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పారు. దీంతో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. అక్కినేని ఇంట్లో సంతోషకరమైన వేడుకలు జరగబోతున్నాయన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, అభిమానుల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి