ఇక రాత్రి 11:30 గంటలకు పెరుమనల్లూర్ సమీపంలోని వలసుపాలయం చేరుకున్నప్పుడు రాజా వాహనాన్ని ఆపాడు. రాజా, జోతిమణి వాహనం నుంచి దిగి, వ్యాన్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటనలో రంగరాజ్ సజీవ దహనం అయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున రంగరాజ్ మరణం గురించి తిరుపూర్ గ్రామీణ పోలీసులకు రాజా సమాచారం అందించాడు. దీన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అయితే, దర్యాప్తు సమయంలో రాజా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో రివర్స్ ఇంట్రాగేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో రాజా ఓ బంక్లో డబ్బాలో పెట్రోల్ నింపుకున్నట్లు తేలింది. సదరు సిసిటివి ఫుటేజీని పోలీసులు సేకరించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిసాయి. రంగరాజ్ అనేక మంది నుంచి సుమారు రూ.1.5 కోట్లు అప్పుగా తీసుకున్నాడని, వారు డబ్బు కోసం తనను నిరంతరం ఇబ్బంది పెట్టినట్లు జోతిమణి పోలీసులకు తెలిపింది. రంగరాజ్ రూ .3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలను తీసుకుని, నామినీగా జోతిమణి పేరును నమోదు చేశాడు. దీంతో బీమా డబ్బును క్లెయిమ్ చేయాలనే ఉద్దేశంతో జోతిమణి అతన్ని చంపి ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం ఆమె బంధువు రాజాను అప్రోచ్ అయ్యింది. ఆమె అతనికి రూ .50,000 అడ్వాన్స్గా ఇచ్చింది. రంగరాజ్ను చంపిన తర్వాత మరో రూ .1 లక్ష ఇస్తానని మాటిచ్చింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, వారు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.