విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్తో పెట్టుకోవడం కంటే జగన్తో సఖ్యతగా ఉంటేనే బెటర్ అని బీజేపీ జాతీయ వర్గాలు భావిస్తున్నాయట. ఏపీలో చంద్రబాబు కంటే జగన్కే ఎక్కువ క్రేజ్ ఉంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పుంజుకోవడం.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం అన్నది కష్టమే అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఈ క్రమంలోనే పార్లమెంటులో వైసీపీ బలం ఎక్కువుగా ఉందని.. ఇది త్వరలోనే మరింత పెరుగుతుందని.. జగన్తో సఖ్యతతో ఉంటేనే మంచిదని భావిస్తున్నారట.
మండలిలో 8 మంది సభ్యులు పదవీ విరమణ చేయడంతో వైసీపీ బలం పెరిగి.. టీడీపీ బలం పడిపోయింది.. ఇప్పుడు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి త్వరలోనే రానుంది. వచ్చే జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒకరు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి కాగా.. మిగిలిన ముగ్గురు బీజేపీలో ఉన్న సురేష్ ప్రభు, టీజీ వెంకటేషే. ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో.. ఈ నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.
రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటే 123 సీట్లు కావాలి.. కానీ ప్రస్తుతం బీజేపీకి అక్కడ 93 మంది సభ్యులే ఉన్నారు. పైగా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ వరుసగా ఓడిపోతూ వస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో 10 మంది ఎంపీలు ( భవిష్యత్తులో కూడా కలిపితే) ఉండే వైసీపీతో అనవసరంగా గొడవ పెట్టుకోవడం.. అవనసరం అన్నదే బీజేపీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ జాతీయ నాయకులు సైతం జగన్ను సైలెంట్గా దువ్వుతోన్న పరిస్థితే ఉంది.