దీంతో తాలిబన్ల అరాచకం తగ్గి ఇక మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవలే 20 ఏళ్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని బేస్ లలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సైన్యం వెనక్కి తగ్గితే తాలిబన్లు రెచ్చిపోతారు అని ఎంతో మంది భావించారు. ఇక అనుకున్నదే జరిగింది. అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే తాలిబన్లు అరాచకం సృష్టించడం ప్రారంభించారు. క్రమక్రమంగా ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. చివరికి ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమే తాలిబన్లకు లొంగిపోయింది.
ఇలా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులకు జో బైడెన్ తీసుకునే నిర్ణయాల కారణం అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జో బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్ లు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇటీవలే ఇక బైడెన్ తన నిర్ణయాలను మరోసారి సమర్థించుకున్నారు. ఇటీవల శ్వేతసౌధం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అమెరికా బలగాల ఉపసంహరణ సరైన సహేతుక నిర్ణయం గా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలా వద్దా అన్న అంశాన్ని తాలిబన్లు తేల్చుకోవాలని ఉంటుందని బైడెన్ వ్యాఖ్యానించారు. వారు విదేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక కొన్ని స్థానాల్లో తాలిబన్లు అమెరికా బలగాల కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదు అని తరలింపుకు కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని అంటూ చెప్పి.. మళ్ళీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి