గాంధీజీ దేశానికి అందించిన గొప్ప మార్గం.. అహింసాయుత పోరాటం.. ఏ సమస్యపైనైనా అహింసాయుతంగా పోరాటం సాగించాలన్న ఆయన ఐడియాలజీ దేశంలో నిరాహార దీక్షలుమౌన దీక్షలుధర్నాలురాస్తా రోకోలు వంటి ఆయుధాలు అందించిందిఆ దీక్షల స్వరూపాలే ఇప్పటికీ కొన సాగుతున్నాయివీటిలో శక్తివంతమైన ఆయుధం నిరాహార దీక్ష.. బాపూజీ చాలా సార్లు ఈ దీక్ష నిర్వహించారు.



ఆయన తర్వాత ఏపీతెలంగాణ రాష్ట్రాల సాధనలో ఈ నిరాహారదీక్ష ఓ ఆయుధంగా మారింది. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న డిమాండ్‌ తో పొట్టి శ్రీరాములు నిర్వహించిన ఆమరణ దీక్ష.. నిరాహార దీక్షల చరిత్రలోనే అత్యంత గొప్ప త్యాగంమద్రాసులోని బలుసు సాంబమూర్తి నివాసంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించారుప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తూ నెహ్రూ ప్రకటన చేసేవరకూ దీక్ష విరమించబోనని పొట్టి శ్రీరాములు భీష్మ ప్రతిజ్ఞ చేశారు



ఆయన తన ప్రాణాలు పోయే వరకూ అదే మాటలపై ఉన్నారుప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డారు కానీ.. దీక్ష విరమించేందుకు మాత్రం ముందుకు రాలేదురోజూ తేనె కలిపిన నీరు మాత్రమే సేవిస్తూ ఆయన 52 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారుఆ తర్వాత దీక్షలోనే ప్రాణాలు వదిలారుఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారుపొట్టి శ్రీ రాములు మరణంతో మదరాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం భగ్గుమందిప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందిఆ కాకతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నెహ్రూ తలవంచక తప్పలేదుప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు నెహ్రూ



తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కేసీఆర్ నిరాహార దీక్ష కీలక మలుపుగా చెప్పుకోవచ్చుకేసీఆర్ నిరాహారదీక్షకు కూర్చోవడంఆయన్ను ఖమ్మం తరలించి దీక్ష భగ్నం చేయడం.. ఓయూలో ఆందోళనలతో దీక్ష కొనసాగిస్తున్నట్టు ప్రకటన చేయడం.. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించడం.. ఉద్యమం ఉజ్జ్వలం కావడం.. చివరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రకటన చేయడం.. చక చకా జరిగాయిఅలా తెలుగు నేలలో రెండు దీక్షలు రెండు రాష్ట్రాలను సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: