శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అసెంబ్లీ నియోజక వర్గంలో వైసీపీకి భారీ ఊరట లభించింది. అవును, కొన్నాళ్ళనుండి ఇక్కడ దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదు అనే ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు తాజాగా అక్కడ లైన్‌ క్లియర్‌ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విషయం ఏమిటంటే, ఆయనపై సొంత భార్య అయినటువంటి దువ్వాడ వాణి పోటీకి సిద్ధం కావడమే ప్రధానం కారణం. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆమధ్య తన అనుచరుల సమక్షంలో ప్రకటించడం కలకలం రేపిన సంగతి అందరికీ తెలిసినదే.

కాగా ఆమె ప్రకటించిన ప్రకారం అయితే నిన్న అనగా ఈనెల 22న అంటే సోమవారమే నామినేషన్‌ వేయాల్సి ఉంది. కానీ, ఆమె నామినేషన్‌ వేయడంపైన వెనక్కి తగ్గారు. అవును, టెక్కలిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా 22న నామినేషన్ వేసేందుకు రెడీ అన్న వాణి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇకపోతే తమ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ ఫుల్ ఖుషీ అయినట్టుగా తెలుస్తోంది.

కాగా తాజా పరిణామాలతో టెక్కలి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో అయితే ఆనందం తాండవిస్తోంది. తన భార్య వాణి నామినేషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ… వాణి నా భార్య కావచ్చు. అయినా సరే ప్రజా క్షేత్రంలో ఎవరికైనా నామినేషన్ వేసే హక్కు, పోటీ చేసే అధికారం ఉందని, దానిని కాదనే అర్హత మరెవారికీ లేదని కామెంట్‌ చేశారు. ఇకపోతే అయన ఇదే అంశంపైన ఇటీవల స్పందిస్తూ... "ఏం చేస్తాం.. కలియుగం! సొంత అన్నదమ్ముల మధ్యే ఇక్కడ సఖ్యత కొరవడుతోంది. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను." అంటూ తన భార్యని ఉద్దేశించి ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: