రాయలసీమ జగన్ కంచుకోట అని వైసీపీ నేతల్లో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ ఉంది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా రాయలసీమలో ఆ పొత్తు అణువంత ప్రభావం కూడా చూపే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. ఎలక్ సెన్స్ సంస్థ తాజాగా సర్వే చేయగా ఈ సంస్థ ప్రకటించిన సర్వే ఫలితాలలో దాదాపుగా 50 శాతం వైసీపీకి అనుకూలంగా ఉండటం గమనార్హం.
 
రాయలసీమలో ఉన్న 52 సీట్లలో కూటమికి 2 స్థానాలు వస్తాయని 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. ఈ మూడు స్థానాలలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందో చెప్పలేము. రాయలసీమలో 2019 నాటి ఫలితాలే రిపీట్ కానున్నాయని మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ సర్వే ఫలితాలతో కూటమి పరువు పోయిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
సరిగ్గా ఎన్నికల సమయంలో వెలువడుతున్న కూటమి ఫలితాలు కూటమి అభ్యర్థులను మరింత టెన్షన్ పెడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమికి ఈ టెన్షన్ ఎన్నికలు పూర్తయ్యాక అయినా తగ్గుతుందో లేదో చూడాలి. రవిప్రకాష్ లాంటి ప్రముఖ జర్నలిస్ట్ లు కూటమికే అనుకూల ఫలితాలు అని చెబుతున్నా కళ్యాణ్ దిలీప్ సుంకర్ లాంటి వాళ్లు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారు.
 
ఏపీలో ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఓటర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వార్ వన్ సైడ్ అయితే కూటమి పరువు పోయినట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి ఈ ఎన్నికల్లో చిత్తు కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం తమకే అనుకూల ఫలితాలు వస్తాయని ప్రభుత్వంపై ఒకింత వ్యతిరేకత ఉందని ధీమాతో చెబుతున్నారు. పోలింగ్ కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు సైతం తెగ టెన్షన్ పడుతుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: