
లిక్కర్ స్కామ్లో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాను, తన కుటుంబం దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమని లోకేష్ తెలిపారు. అయితే, జగన్ సన్నిహితుడు భాస్కర్ రెడ్డి కూడా ఇలాంటి ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కు సంబంధం లేదని వారు దేవుడి సాక్షిగా చెప్పగలరా అని లోకేష్ ప్రశ్నించారు. జగన్పై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని, చట్టప్రకారం తప్పు చేసిన ఎవరినీ విడిచిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
ప్రజలు తమకు అధికారం ఇచ్చింది కక్ష సాధించడానికి కాదని, రాష్ట్ర అభివృద్ధికి పనిచేయడానికేనని లోకేష్ నొక్కి చెప్పారు. జగన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉద్రిక్తతలను సృష్టించేలా ఉన్నాయని, ఇటువంటి చర్యలు రాజకీయంగా బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు