సీఎం చంద్రబాబు అంటేనే అభివృద్ధి రంగానికి పెద్దపీట వేస్తారు.టెక్నాలజీ వంటివి తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేశారు.సంక్షోభాలని ఆకాశంగా మలుచుకోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని చెప్పవచ్చు. ఇప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవలసిన పరిస్థితి ఏపీలో ఏర్పడింది. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో తరచూ వర్షాలతో రోడ్లన్నీ మునిగిపోవడం, అపార్ట్మెంట్లలోకి రావడం వల్ల అక్కడ ఉండడానికి కూడా చాలామంది మక్కువ చూపడడం లేదు, వీటికి తోడు ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో బస్ స్టేషన్స్ , బ్రిడ్జ్జస్ వంటివి కూడా మునిగిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అక్కడ ఉండేటువంటి కంపెనీలను ఏపీకి తరలిరావడానికి అవకాశం కల్పిస్తే అటు నిరుద్యోగులకు, అభివృద్ధికి కూడా చాలా ఉపయోగపడుతుంది.



ఇటీవల కాలంలో హైదరాబాదులో రోడ్ల పరిస్థితుల వల్ల అక్కడ కంపెనీలను పెట్టలేమని చెప్పిన వారిని లోకేష్ ఏపీకి ఆహ్వానించారు. అలా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్స్ MSML కంపెనీలను పిలిస్తే రావడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏపీలో చాలా చోట్ల భూములు ఉన్నాయి. కృష్ణ ,గుంటూరు, జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అమరావతి ,విజయవాడ, గుంటూరు, తెనాలి ,మంగళగిరి వంటి ప్రాంతాలలో కలిపినటువంటి వాటన్నిటినీ కూడా రాజధానిగా ప్రకటిస్తే.. వీటివల్ల ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ ప్రాంతలు మొత్తం కూడా రాజధానిగా మారిపోతాయి.


ఈ ప్రాంతంలో ఎక్కడ పరిశ్రమలు పెట్టుకున్న సరే రాజధానిలో పెట్టుకున్నట్టే అని చెబితే కచ్చితంగా బడా కంపెనీలు సైతం ఏపీకి తరలి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వారికి ప్రోత్సాహాలు, లోన్స్, ఇతర సౌకర్యాలు  కల్పిస్తే చాలు చాలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. కూటమిలో భాగంగా బిజెపి ఉన్నది, ఈ కంపెనీలకు సంబంధించి లోన్ల విషయంలో మాట్లాడి  వారికి కావలసిన సదుపాయాలను ఏపీ ప్రభుత్వం కల్పిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. మరి ఇలా వచ్చిన అవకాశాన్ని సీఎం చంద్రబాబు ఉపయోగించుకుంటారు లేదొ చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: