ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుందా? తెలుగుదేశం పార్టీ పగ్గాలు త్వరలోనే నారా లోకేష్ చేతికి వెళ్ళబోతున్నాయా? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో నారా లోకేష్ పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు "లోకేష్ అంటే స్పీచ్ రాదు", "రాజకీయాలకు పనికిరారు", "తండ్రి పేరుతోనే ముందుకు వస్తున్నాడు" అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, కాలం మారింది... ఇప్పుడు లోకేష్ మాట్లాడితే ప్రజలు ఫిదా అవుతున్నారు. ఆయన మాట్లాడే తీరు, వాక్చాతుర్యం, ప్రెజెంటేషన్ — ప్రతి ఒక్క దాంట్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఆయనను వ్యంగ్యంగా అనుకరించిన ప్రతిపక్ష నేతలే ఇప్పుడు ఆయన మాట్లాడే పదజాలాన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా  గూగుల్ లాంటి కంపెనీల సీఈఓలతో మాట్లాడి, భారీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం ద్వారా లోకేష్ తన దూరదృష్టిని, ప్లానింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. దీంతో ఆయన రాజకీయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

ఇప్పటి పరిస్థితుల్లో టిడిపి నేతలు కూడా "లోకేష్ పట్టాభిషేకానికి ఇప్పుడు సమయం వచ్చింది" అంటూ చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారట."ఇంకెందుకు ఆలస్యం? వెంటనే లోకేష్ పట్టాభిషేకం జరిపించేయండి" అని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారని సమాచారం. దానికి కారణం కూడా ఉంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు, గతంలో కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం ఆలస్యమవడం వల్లే ఆ పార్టీ నష్టపోయింది. రాహుల్ దగ్గర నాయకత్వం చూపించే సత్తా, విజన్ ఉన్నప్పటికీ, తగిన సమయంలో బాధ్యతలు ఇవ్వకపోవడం వల్ల ఆయనకు గుర్తింపు ఆలస్యమైంది. అదే విధంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా కేటీఆర్‌కు పట్టాభిషేకం ఆలస్యం కావడం వల్ల బీఆర్‌ఎస్ ప్రస్తుతం ఇబ్బందుల్లో పడింది.

ఈ రెండు ఉదాహరణలను బేస్ చేసుకుని, ఇప్పుడు టిడిపి నేతలు చంద్రబాబుకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు —“మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే లోకేష్‌కి పగ్గాలు అప్పజెప్పేయండి, అదే సరైన టైం.”లోకేష్ ఇప్పుడు ప్రజలతో కలిసిపోయే నాయకుడిగా మారాడు. ఆయన ఏ ప్రాంతానికెళ్లినా యువత నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఆర్థిక దృక్పథం, నూతన ఆలోచనలతో ప్రజలకు చేరువ అవుతున్న ఆయనలో భవిష్యత్ నాయకుని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.పార్టీ లోపల కూడా చాలా మంది నేతలు ఆయనలో ఉన్న ఆర్గనైజేషన్ స్కిల్స్‌ను గుర్తించి, కొత్త తరం నాయకుడిగా ప్రోత్సహిస్తున్నారు. "చంద్రబాబు గారు చాలా కాలంగా పార్టీని విజయవంతంగా నడిపారు, కానీ ఇప్పుడు తరం మార్పు అవసరం" అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.రాజకీయ వర్గాల అంచనా ప్రకారం — అన్ని కుదిరితే వచ్చే జనవరి నెలలో, అంటే లోకేష్ పుట్టినరోజు సందర్భంలోనే, ఆయన పట్టాభిషేకం అధికారికంగా జరగొచ్చు అంటున్నారు.అంతేకాకుండా, ఈ కార్యక్రమాన్ని పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్కర్స్ మీటింగ్‌లు, ప్రజా సభలు కూడా జరిపి "లోకేష్ యుగం ప్రారంభం" అని టిడిపి వర్గాలు ప్రకటించే అవకాశముంది.

ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి దృష్టి ఒకటే ప్రశ్నపై నిలిచింది —“చంద్రబాబు ఈ సారి ఏ నిర్ణయం తీసుకుంటారు?”ఎందుకంటే, ఆయన చేసే ఒక్క నిర్ణయం టిడిపి భవిష్యత్తును, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది.ఒకవేళ ఈ పట్టాభిషేకం జరిగితే, ఆ రోజే తెలుగు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: