రాజకీయం కోసం కాదు, బ్రిటిష్ 'సేఫ్టీ వాల్వ్'గా స్థాపన! .. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది భారతీయులు కాదు అనే చారిత్రక సత్యాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. భారతీయుల రాజకీయ హక్కుల కోసం ఒక వేదిక సృష్టించడానికి విదేశీయుడైన ఏ.ఓ. హ్యూమ్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. 1857 తిరుగుబాటు తరువాత.. బ్రిటిష్ పాలనపై భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తిని నియంత్రించేందుకు, మరొక తిరుగుబాటును నివారించేందుకు ఒక 'సురక్షిత వాల్వ్' (Safety Valve) గా కాంగ్రెస్ను ఉపయోగించుకోవాలని హ్యూమ్ భావించాడు! గాంధీ చివరి మాట... విస్మరించిన కాంగ్రెస్! .. ఇందులో అత్యంత సంచలనాత్మక విషయం ఏంటంటే... జాతిపిత మహాత్మా గాంధీ తన హత్యకు గురయ్యే ముందు రోజు చెప్పిన మాట! "కాంగ్రెస్ తన లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు ఇది రాజకీయ పార్టీగా కొనసాగడం అనవసరం.
దీనిని రద్దు చేసి, దేశ సేవ కోసం ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేయాలి" అని ఆయన సూచించారు. కానీ ఆ సూచనను ఏ మాత్రం పట్టించుకోకుండా... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని రాజకీయాలకు వాడుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం అనే కాన్సెప్ట్తో ఒకే కుటుంబం వారసత్వంగా రాజకీయ పదవులు పొందుతూ వచ్చింది. ఈ పతనాన్ని చూశాక... ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ పట్ల ఎలాంటి అభిమానం మిగలలేదు. ప్రస్తుతం గట్టిగా మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్... వంద సీట్లలో కూడా ముఖాముఖి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అందుకే, మహాత్మా గాంధీ సూచనలను పాటించి, పార్టీని క్లోజ్ చేసి ప్రత్యామ్నాయ పార్టీ ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలి. లేకపోతే... చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందనడంలో సందేహం లేదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి