ఇక ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఇటీవల బిసిసిఐ అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి కూడా ఇచ్చింది. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే చూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు చేస్తే.. ఎన్నో అంచనాలు ఉన్న సూర్య కుమార్ యాదవ్, పంత్ లు మాత్రం తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయాడు ఈ విషయంపై స్పందించిన గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ ని చూసి నేర్చుకోవాలి అంటూ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లకు సూచించాడు. కోహ్లీ అద్భుతంగా ఆడి పరుగులు రాబట్టారు. సింగిల్స్ డబుల్స్ గా మార్చాడు. ప్రతిసారి భారీ షాట్లు కొట్టేందుకు వీలు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోహ్లీ మినహా మిగతా అందరు కూడా అనవసరమైన షాట్లు వికెట్ చేజార్చుకున్నారు అంటూ వ్యాఖ్యానించాడు.