భారత కెప్టెన్
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ ముందరఉన్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో గురువారం మొదలైన తొలి టెస్టులో
విరాట్ కోహ్లీ భారీ శతకం సాధించగలిగితే
భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-6 లోకి చేరే అవకాశం కనపడుతోంది. నిన్న
బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకి అల్ అవుట్ అందరికి తెలిసినదే. దీనితో
భారత్ జట్టు 86/1 తో తొలిరోజు ఆటని ముగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (37 బ్యాటింగ్: 81 బంతుల్లో 6x4), చతేశ్వర్ పుజారా (43 బ్యాటింగ్: 61 బంతుల్లో 7x4) అడుతూన్నారు. టీమిండియా తరపున ఇప్పటి వరకూ 83 టెస్టులు ఆడిన
విరాట్ కోహ్లీ 7,066 పరుగులు చేయగలిగాడు.
భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాని ఓకసారి పరిశీలిస్తే,
సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాలలో
రాహుల్ ద్రవిడ్ (13,288),
సునీల్ గవాస్కర్ (10,122), వీవీఎస్
లక్ష్మణ్ (8,718), వీరేంద్ర సెహ్వాగ్ (8,586),
సౌరవ్ గంగూలీ (7,212)
భారత్ టాప్-6 లో ఉన్నారు. దీనితో ప్రస్తుతం 7,066 పరుగులతో ఏడో స్థానంలో ఉన్న
విరాట్ కోహ్లీ మరో 147 పరుగులు చేస్తే గంగూలీని వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకుంటాడు.
భారత్ తరపునే కాకుండా, టెస్టు క్రికెట్లోనూ మరికొందరి రికార్డ్ ని కూడా
కోహ్లీ అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (7,214 పరుగులు), న్యూజిలాండ్ కి చెందిన స్టీఫెన్ ప్లెమింగ్ (7172), గ్రేగ్ ఛాపెల్ (7110) టెస్టు రికార్డ్ లను
కోహ్లీ బ్రేక్ చేయనున్నాడు. ఇలా చేసుకుంటూ వెళ్లడం మన భారతదేశ
క్రికెట్ సారధి
విరాట్ కోహ్లీకి పరిపాటిగా మరి పోయింది.