ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఐపిఎల్. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్  చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం ఫైనల్ పోరు కోసం క్వాలిఫైయర్ మ్యాచ్ లు  ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టుగా   ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న... ముంబై ఇండియన్స్ జట్టు ఈ  ఐపీఎల్ సీజన్ లో కూడా అదరగొట్టిన విషయం తెలిసిందే.


 ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే చిత్తు చేస్తూ వరుస విజయాలను అందుకుంటూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ ఐపీఎల్ సీజన్ లో మొట్టమొదటగా ప్లే ఆప్ కి అర్హత సాధించిన జట్టు గా కూడా రికార్డు సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు. ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ కు వెళ్లిన మొట్టమొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు. ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న  మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.


 ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా అటు ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా అన్ని విభాగాల్లో  ఆధిపత్యం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల చేయగా ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం ఎనిమిది వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. దీంతో ఘన విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ లోకి  అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: