టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి క్రీడాభిమానులకు అందరికీ తెలుసు.  అతడు రిటైరయి పోయినాక కూడా అతడి ప్రభావం ఇండియా జట్టు మీద స్పష్టంగా కనిపిస్తుంది. మహేంద్రుడు అన్ని అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ప్రస్తుతం సందడి చేస్తున్నాడు. కానీ కరోనా వలన ఈ ఏడు ఐపీఎల్ కూడా పూర్తిగా జరగకముందే వాయిదా పడింది. దీంతో క్రీడాభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. కానీ వాయిదా పడిన లీగ్ ను మరలా యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు. ఇక కరోనా లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లు కూడా అంతగా నడవట్లేదు. ఏదో అడపాదడపా సిరీస్ లు ఆడినా కూడా ఎవర్నీ ప్రేక్షకులను లోనికి అనుమతించడం లేదు. ఇటువంటి తరుణంలో ప్రేక్షకులకు టీవీలు, న్యూస్ వల్లనే క్రీడా విశేషాలు తెలుస్తున్నాయి.
కాగా ధోని ముంబైలో బాలీవుడ్ తారలతో కలిసి ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు.


ఇది ఎటువంటి పోటీలా కాకుండా ఓ ఛారిటీ కోసం సరదాగా ఆడారు. కానీ ఇందులో కూడా ధోని బాలీవుడ్ తారలను ఓడించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో పాల్గొన్న ధోని హెయిర్ స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా కనిపిస్తున్నాడు. అంతకు ముందు జరిగిన ఓ మ్యాచులో బాలీవుడ్ కు చెందిన అగ్రశ్రేణి హీరో, దీపికా పదుకునే భర్త రణ్‌వీర్ సింగ్ తో మహేంద్రుడు ఓ ఫొటో దిగాడు. మరో విషయమేంటంటే ఈ ట్రైనింగ్ సెషన్ కు ధోనితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: