గత కొంత కాలం నుంచి టీమిండియాకు ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియాకు ఇక వరుస ఓటములు ఎదురయ్యాయి. దీంతో టీమిండియా అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. అయితే ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో పలు మార్లు ఎదురు దెబ్బలు తిన్న టీమిండియా.. ఈసారి తప్పక గెలుస్తుందని పలువురు క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవలే భారత మాజీ క్రికెటర్.. క్రికెట్ ప్రెసెంటెటర్ సునీల్ గవాస్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ ల సిరిస్ గురించి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా గత మూడు టూర్ లలో కూడా టీమిండియా కు చేదు అనుభవం ఎదురైంది. కానీ ఈ సారి మాత్రం గెలిచి తీరుతుంది అని విశ్లేషకులు చెబుతుంటే.. గెలవడం కాదు ఇక ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తుంది అని సునిల్ గావస్కర్ చెప్పారు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లాండ్ ను క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆధిపత్యాన్ని టీమిండియా సాధిస్తుందని చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి