ఈ ఏడాది మునుపెన్నడూ లేనంతగా విరాట్ కోహ్లీ పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే  ఒకప్పుడు భారీగా పరుగులు చేస్తూ రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు డబల్ డిజిట్ స్కోరు అందుకోవడానికి కూడా తెగ కష్టపడి పోతున్నాడు. అంతేకాదు వరుసగా మ్యాచ్ లలో డక్ ఔట్ అయ్యి అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 మ్యాచ్ లలో 7 విజయాలు సాధించింది పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. కాగా ఇప్పుడు వరకు 12 మ్యాచ్ లలో కేవలం 316 పరుగులు మాత్రమే చేశాడు విరాట్ కోహ్లీ.


 గత కొన్ని మ్యాచ్ల నుంచి మాత్రం వరుసగా డకౌట్ అవుతూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కి ఏమైంది అనే ప్రశ్న ప్రస్తుతం ఎక్కడ చూసినా వినబడుతుంది అనే చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో మొదటి సారి ఔటయ్యాడు విరాట్ కోహ్లీ. ఇక ఆ తర్వాత మరోసారి సన్రైజర్స్ తో మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. ఇక లక్నో తో జరిగిన మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ గోల్డ్ డక్ గానే వెనుదిరిగాడు. ఇకపోతే ఇటీవలే ఆర్సిబి ఇన్సైడర్ పేరుతో దానిష్ సైత్  విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు.


 ఇంటర్వ్యూ లో భాగంగా కోహ్లీ గోల్డెన్ డకౌట్ లపై ప్రశ్నలు అడిగే ఆసక్తికర సమాధానాలు చెప్పాడు విరాట్ కోహ్లీ. మీకు పెట్స్  పెంచడం ఎంతో ఇష్టం అని విన్నాను అని అడుగగా.. అవును అంటూ సమాధానం చెప్తాడు కోహ్లీ. మరి మీ ఇంట్లో ఎన్ని పెట్స్ ఉన్నాయి అంటు అడగగా.. సమయం లేకపోవడంతో పెంచుకోలేదు అంటూ సమాధానం చెప్తాడు. అయితే ఇటీవలే మీకు రెండు డక్స్ వచ్చాయి కదా అంటూ అడగగా..  కోహ్లీ నవ్వుతూ తన కెరీర్లో ఎప్పుడూ ఇలా కాలేదని గోల్డెన్ డక్ ఔట్ పై వస్తున్న విమర్శలు పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: