ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ ఇక మరో రికార్డు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సిక్సులు కొట్టిన అతిపిన్న వయస్కుడైన ఇండియన్ క్రికెటర్ గా రిషబ్ పంత్ నిలిచాడు.అయితే గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 25ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ వంద సిక్స్ ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక పంత్ 24ఏళ్ల 271 రోజుల్లోనే 100 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఇక ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పంత్ బాగా చెలరేగి ఆడాడు. దెబ్బకు సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో పంత్ మొత్తం 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. ఇంకా అతడి స్కోర్ లో  మొత్తం 19 ఫోర్లు ఇంకా అలాగే 4 సిక్సులు ఉన్నాయి. మొత్తంగా టెస్టుల్లో 48 సిక్సులు, వన్డేల్లో 24 సిక్సులు ఇంకా అలాగే టీ20లలో 31 సిక్సులు బాదాడు పంత్.ఇక ఈ టెస్ట్ మ్యాచ్ కి ముందు రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 99 సిక్సులు బాదాడు. ఇంగ్లండ్ బౌలర్లపై రిషబ్ పంత్ ఎదురుదాడికి దిగాడు. ఇంకా పరుగుల వరద పారించాడు.


ఇక అంతేకాదు కేవలం 89 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ వికెట్ కీపర్ గా కూడా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. తన టెస్ట్ కెరీర్ లో పంత్ కు ఇది 5వ టెస్ట్ సెంచరీ. ఇంగ్లండ్ జట్టుపై ఇది 3వది.ఇక ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లో టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ రిషబ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు.పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తన సెంచరీతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (83*)తో కలిసి ఆరో వికెట్‌కు మొత్తం 222 పరుగులను జోడించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 338/7 స్కోరు అనేది సాధించింది. అద్భుత శతకం బాదిన పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్‌ గంగూలీ, ఇయాన్ బిషప్, జై షా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆనంద్‌ మహింద్రా, వసీమ్‌ జాఫర్, ఇషా గుప్తా ఇంకా అలాగే రషీద్‌ ఖాన్‌ తదితరులు పంత్ ను అభినందించారు. ప్రశంసలతో ఎంతగానో ముంచెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: