టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన ముగిసింది అన్న విషయం తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో గాయం నుంచి కోలుకునీ జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కి సారథ్య బాధ్యతలు అప్పగించింది బిసిసీఐ. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ముందుగా అందరూ ఊహించినట్లుగానే ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు పసికూన జింబాబ్వే జట్టు పై విరుచుకుపడింది. వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.


 ఈ క్రమంలోనే ప్రత్యర్థి జింబాబ్వే జట్టు 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే.  అయితే రెండు వన్డేల్లోనూ ఎంతో అలవోకగా విజయం సాధించిన భారత జట్టు మూడో వన్డేలో ఎంతో ఉత్కంఠ  భరితమైన పోరులో 13 పరుగుల పలక తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కు టీమిండియా కెప్టెన్గా ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. అయితే ఇటీవలే మూడో వన్డే గెలిచిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో చేసుకున్న సెలబ్రేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 కాలా చష్మా అనే పాటకు టీమిండియా లోని ఆటగాళ్లు అందరూ కూడా డాన్స్ తో ఉర్రూతలూగించారు. యంగ్ ప్లేయర్స్ ఇషన్ కిషన్, సిరాజ్, శుభమన్ గిల్ రెచ్చిపోయి చిందులు వేశారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.  విజయాన్ని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అని ఒక జాప్యం జోడించి  శిఖర్ దావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇక ఈ వీడియోని పోస్ట్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: