ఆ తర్వాత రాహుల్ కు జత కలిసిన సూర్య కుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అయితే రాహుల్ అర్ద సెంచరీ 55 పరుగులు అయ్యాక అవుట్ కాగా, సూర్య మాత్రం 46 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటి వరకు ఒక రకంగా సాగిన ఇండియా ఇన్నింగ్స్ అప్పుడు సునామీ రాబోతోందని ఎవ్వరూ ఊహించలేదు. హార్దిక పాండ్య తన ఇన్నింగ్స్ ను నెమ్మదిగా మొదలు పెట్టి ఒక సునామీని సృష్టించాడు. హార్దిక్ ఒక్కడే కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేశాడు అంటే ఆస్ట్రేలియా బౌలర్లను ఎంత ఊచకోత కోశాడో అర్ధం చేసుకోవచ్చు. ఇతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు 5 సిక్సర్లు ఉన్నాయి.
హార్దిక్ కనుక ఆ రకంగా ఆడకపోయి ఉంటే ఇండియా ఆ మాత్రం స్కోర్ చేయడం వీలయ్యేది కాదు. ముఖ్యంగా కార్తీక్ మరియు క్సర్ పటేల్ లు విఫలం అయ్యారు. పంత్ ను తీసేసి కార్తీక్ ను తీసుకోవడం వలన ఉపయోగం లేకుండాపోయింది. హార్దిక్ ఇదే ఫామ్ ను కనుక కొనసాగిస్తే వరల్డ్ కప్ మనదే.