షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు ఉదయం పాకిస్తాన్ మరియు థాయిలాండ్ ల మధ్యన మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో వికెట్ల 5 నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ ఆటగాళ్లను థాయిలాండ్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ కు ఓపెనర్ నత్తకం చంతం అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. చంతం అర్ద సెంచరీ (61) సాధించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే పాకిస్తాన్ తమ అనుభవంతో ఆఖర్లో వికెట్లు తీసినా ఎక్సట్రాలు వేసి థాయిలాండ్ కు విజయాన్ని అందించింది పాక్... అలా థాయిలాండ్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ ను ఓడించి రికార్డు సృష్టించింది.
థాయిలాండ్ ఇదే విధంగా మరో టీం ను ఓడించిందా టాప్ 4 లో మార్పులు జరగడం ఖాయం. మరి పాకిస్తాన్ ఈ దారుణ ఓటమి నుండి తేరుకుని మంచి కమ్ బ్యాక్ ఇస్తుందా చూడాలి. ఇక ఈ రోజు జరుగుతున్న మరో మ్యాచ్ లో బంగ్లా తో మలేషియా ఆడనుంది.