ఏకంగా 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. తద్వారా ఏకంగా జట్టు విజయంలో కీలక పాత్ర వహించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. తన అద్భుతమైన 360 డిగ్రీస్ ఆట తీరుతో క్రికెట్ ప్రేక్షకులు అందరిని కూడా మంత్రముగ్ధులను చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సూర్య కుమార్ యాదవ్ సాధించిన సెంచరీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల సూర్య కుమార్ సెంచరీ చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు టి20 లలో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఒకసారి ఈ లిస్టులోకి తొంగి చూస్తే ప్రస్తుతం భారత రెగ్యులర్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు వరకు రోహిత్ తన కెరియర్లో నాలుగు టి20 సెంచరీలు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ రోహిత్ తర్వాత రెండవ స్థానంలో రెండు సెంచరీలు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు, సురేష్ రైనా -1, విరాట్ కోహ్లీ 1, దీపక్ కూడా 1, మహిళా క్రికెటర్ హార్మన్ ప్రీత్ కౌర్ 1 సెంచరీలతో ఈ లిస్టులో కొనసాగుతున్నారు అని చెప్పాలి.