మరో రెండు నెలల్లో వరల్డ్ కప్ జరగబోతుంది. ఇక ఈ వరల్డ్ కప్ కు భారత్ ఆతిధ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఇకఈ ఐసీసీ టోర్నీలో భాగంగా టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు కూడా బరిలోకి దిగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే.. ఇక వరల్డ్ కప్ నేపథ్యంలో అటు జట్టులో మాత్రమే కాదు జట్టు మేనేజ్మెంట్ లో కూడా ఎన్నో అనూహ్యమైన మార్పులు చేసుకుంటూ ఉన్నాయి కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్లో కూడా గత కొంతకాలం నుంచి ఇక కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక అవుతాడు అన్న వార్తలు వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.


 ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న పాకిస్తాన్.. ఇక భారత వేదికగా ఈ వరల్డ్ కప్ సాధించి ఒక మరుపురాని విజయాన్ని సాధించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ గెలవడం అంటే జట్టు సెలక్షన్ విషయంలో ఎంతో ఆచీ తుచీ వ్యవహరించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టుకి చీఫ్ సెలెక్టర్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే పాకిస్తాన్ మాజీ టెస్ట్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ను ఇక చీఫ్ కలెక్టర్ పదవి కోసం ఎంపిక చేస్తారు అని ప్రచారం జరగగా.. ఇక ఇప్పుడు ఇదే నిజమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ జాకా అష్రఫ్ ఇక మాజీ టెస్ట్ క్రికెటర్ మహమ్మద్ హాఫిజ్ ను చీఫ్ సెలెక్టర్ పదవిని ఆఫర్ చేశారు. ఆఫీస్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు జాకా ఆశ్రఫ్ తెలిపారు. అయితే ఈ ఆఫర్ పై ఇటీవలే మహమ్మద్ హఫీజ్ మాట్లాడాడు. జాకా అష్రఫ్ మంచి అడ్మినిస్ట్రేటర్. నిజాయితీగా నేను అతడిని చాలా గౌరవిస్తాను. అయితే పాకిస్తాన్ క్రికెట్కు సేవ చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ విషయాన్ని నేను పరిశీలిస్తాను అంటూ మహమ్మద్ హాఫిజ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: