ఇటీవల కాలంలో టీమిండియాలో యంగ్ క్రికెటర్స్ దే ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఆట తీరుతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శుభమన్ గిల్ కూడా ఒకరు.  కేవలం ఒకే ఫార్మాట్ ప్లేయర్గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శుభమన్ గిల్ ఇప్పుడు మూడు ఫార్మాట్ల ప్లేయర్ గా కూడా మారిపోయాడు. తన ఆట తీరుతో తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి.


 అయితే ఇక టీమిండియాలోకి అడుగుపెట్టిన నాటి నుంచి కూడా గిల్లు ఓపెనర్ గానే బ్యాటింగ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. దీంతో ఇక అతను ఫ్యూచర్ ఓపెనర్ అని అటు భారత అభిమానులు కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలో వెస్టిండీస్ పర్యటనలో మాత్రం శుభమన్ గిల్ ఓపెనింగ్ స్థానాన్ని కొత్త ఆటగాడి కోసం త్యాగం చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. జట్టులో ఛాన్స్ దక్కించుకున్న యశస్వి జైష్వాల్ రోహిత్ కు జోడిగా ఓపెనర్ గా బరీలోకి దిగగా.. అటు శుభమన్ గిల్ మాత్రం ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.



 పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శుభమన్ గిల్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు అని చెప్పాలి. అయితే ఇలా ఈ యంగ్ ప్లేయర్ ఓపెనర్ గా రాకపోవడంపై చర్చ జరుగుతుంది. కాగా ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు. గిల్ స్వయంగా  తాను మూడవ స్థానంలో ఆడతానని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంపై కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు చేయాలని ఏకంగా బ్యాట్స్మెన్ స్వయంగా కోరడం అసాధారణమైన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా యశస్వి జైష్వాల్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి ఇక తన స్థానాన్ని టీమ్ ఇండియాలో సుస్థిరం చేసుకునేలాగే కనిపిస్తున్నాడు. దీంతో గిల్ ను మరోసారి ఓపెనర్ గా చూస్తామా లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: