టీమిండియాలో స్టార్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు జస్ ప్రీత్ బుమ్రా. టీమిండియా బౌలింగ్ విభాగాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించే ఫేసర్గా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు విజయాలలో అతను ఎప్పుడు కీలకపాత్ర వహిస్తూ అదరగొడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే జస్ ప్రీత్ బూమ్రా అటు భారత జట్టు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే క్లిష్టమైన సమయంలో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధులను వనికిస్తూ   ఉంటాడు. బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ.. ఇక వికెట్లు పడగొడుతూ ఉంటాడు ఈ పేసర్. అయితే బుమ్రా భారత జట్టుకు ఎంత ఇంపార్టెంట్ అనేది మొన్నటికి మొన్న గాయంబారినపడి అతను జట్టుకు దూరమైనప్పుడు అందరికీ అర్థమైంది.


 అయితే గాయం నుంచి కోలుకొని మళ్ళీ భారత జట్టులో చేరిన బుమ్రా ఇప్పుడు తనదైన ఆట తీరుతో మళ్ళీ ఆకట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆసియా కప్ లో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. అయితే స్టార్ ఫేసర్ బుమ్రాకి గత కొంతకాలం నుంచి ఎంతోమంది మాజీలు కొన్ని సలహాలు ఇస్తున్నారు. బుమ్రా కెరియర్ ఎక్కువ కాలం కొనసాగాలి అంటే.. ఏదో ఒక ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించడం మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా మాజీ ఫేవర్ మెక్ గ్రాత్  ఇలాంటి సూచన చేయగా.. ఇప్పుడు శ్రీలంక మాజీ ఫేసర్ చమీందా వాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


 మూడు ఫార్మట్ లలో కొనసాగి కెరియర్ రిస్క్ లో పెట్టుకోవడం కన్నా ఒకదాన్ని వదిలేసి మిగిలిన రెండింటిపై దృష్టి పెట్టడం ఉత్తమం అంటూ చమిందా వాస్  పేర్కొన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి బుమ్రా తరచూ గాయల బారిన పడుతున్నాడు  ఈ క్రమంలోనే విభిన్న యాక్షన్ తో బంతులు వేసే బుమ్రా ఏదో ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడం మంచిది. ఫేస్ బౌలర్ల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇలాంటి భిన్నమైన రన్నప్ తో బంతులు వేసే బుమ్రా.. ఎక్కువకాలం కొనసాగలి అంటే.. ఒక ఫార్మాట్ ను వదిలేయాలి అంటూ చమిందా వాస్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: