వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అటు భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయిన బాధలో ఉన్న భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో విజయం ద్వారా కాస్త ఉపశమనం కలిగించడంలో సక్సెస్ అయింది టీమ్ ఇండియా. అయితే ఈ టి20 సిరీస్ లో సీనియర్ క్రికెటర్ల అందరికీ కూడా విశ్రాంతి ప్రకటించగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్స్ తో కూడిన భారత జట్టు బరిలోకి దిగింది. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని యంగ్ క్రికెటర్లు ఎలా రాణిస్తారు అని అందరూ అనుమానపడ్డప్పటికీ ఊహకందని రీతిలో అద్భుతమైన ప్రదర్శన చేశారు యువ ఆటగాళ్లు.


 ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. కాగా వరుసగా రెండు మ్యాచ్లను విజయం సాధించిన టీమిండియా.. మూడో మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. ఇక ఆ తర్వాత మిగిలిన మరో రెండు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. దీంతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకోవడం గమనార్హం. అయితే ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా వ్యాఖ్యాత హెడెన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.


 ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో అర్షధీప్ బోలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అతను వేసిన బౌన్సర్ నూ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఇక అదే ఓవర్లో బ్యాట్స్మెన్ స్ట్రైట్ గా కొట్టిన బంతి మరో అంపైర్ కు తగిలి అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా వ్యాఖ్యత హెడెన్ ఎంపైర్లు రెండోసారి అంపైర్ తన పని పూర్తి చేశారు అంటూ కామెంట్ చేశాడు. ఇద్దరు అంపైర్లు కలిసిమెలిసి పనిచేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాఖ్యాతగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అందరూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: