భారతీయ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు బడ్జెట్‌ ఫోన్లకే పరిమితమైన ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ  రియల్‌ మీ అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో  ఒక ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ బుధవారం లాంచ్‌ చేసింది. రియల్‌  ఎక్స్‌ 2 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇండియ‌న్ మార్కెట్లోకి వ‌చ్చింది. ఇది రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు రియల్‌ ఎక్స్‌ 2  ప్రొ మాస్టర్‌ ఎడిషన్‌ కూడా లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి.  

 

ఈ ధరలు ఇలా ఉన్నాయి.. ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 ఉండ‌గా మాస్టర్‌ ఎడిషన​ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ.34, 999గా నిర్ణ‌యించారు. అలాగే రియల్‌ మి ఎక్స్‌ 2 ప్రో ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 6.50 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 + ప్రాసెసర్, ఆండ్రాయిడ్‌ 9పై, 1080 x 2400 పిక్సె ల్స్‌ రిజల్యూషన్‌,  8జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ అమ‌ర్చిన‌ట్టు తెలుస్తోంది.

 

అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా, 64+13 +8+ 2 ఎంపీ క్వాడ్‌ రియర్‌కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌తో పాటు రియల్ మి ఎస్‌ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. 48ఎంపీ ప్రైమరీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో  రెండు  వేరియంట్లలోలాంచ్‌ చేసింది. య రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి వీటిని అమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: