కరోనా సమయంలో ఎక్కువగా అందరూ.. ఆన్లైన్ పేమెంట్ ఎక్కువగా జరుగుతూనే ఉంది.. ప్రతి ఒక్కరు తమ బ్యాంకు లావాదేవీలను ఎక్కువగా ఆన్లైన్లోనే చేయడం జరిగింది.. ఇక టెక్నాలజీ మారుతున్న కొద్దీ.. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ బాటనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక అందుకే ఇంట్లో నుంచి బ్యాంకు సర్వీసులను పొందవచ్చు.. ఇక డిజిటల్ పేమెంట్ యాప్స్ మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి చేతి వేళ్ళ లోని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఫోన్ పే, గూగుల్ పే , పేటీఎం వంటి యాప్ లు వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్ మరింత సులభం అవుతున్నాయి. ఇక యూజర్లను మరింతగా ఆకట్టుకోవడానికి డిజిటల్ ప్లాట్ ఫామ్ లు కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే గూగుల్ పే ఫ్లాట్ఫామ్ కూడా తమ యూజర్ల కోసం డిజిటల్ పర్సనల్ పేమెంట్ అని కూడా ఆఫర్ చేస్తోంది.. అంతేకాదు తమ యూజర్లకు ఏకంగా లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ ఆఫర్ చేయడం గమనార్హం. ఇకపోతే ఎవరైనా సరే ఈ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ ను పొందాలి అనుకుంటే గూగుల్ పే యూజర్లు తప్పనిసరిగా క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండాల్సిందే. ఇక క్రెడిట్ స్కోర్ ఆధారంగా గూగుల్ పే తన యూజర్లకు సుమారుగా లక్ష రూపాయల వరకు లోన్ అందించడానికి ముందుకు వచ్చింది.


ఇకపోతే గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు..DMI ఫైనాన్స్ కంపెనీ ద్వారా.. డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ ను తీసుకు వచ్చింది గూగుల్ పే.. ఇకపోతే ఈ ఆఫర్ పొందాలి అనుకుంటే అర్హత కలిగిన యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది.. అది కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే మీరు లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశాన్ని కల్పించింది గూగుల్ పే.. ఇకపోతే ఈ లోన్ మొత్తాన్ని కేవలం మూడు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లకు గూగుల్ పే అందిస్తున్న ఈ బెనిఫిట్ చాలా ప్రయోజనకరం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: