
సాధారణంగా అమావాస్యనాడు కొత్త వస్తువులు కొనడానికి చాలా మంది ఇష్టపడరు. కొందరు అమావాస్యను నెగిటివ్గా, ఒక చెడు రోజుగా పరిగణిస్తారు. మరీ ఆదివారం అమావాస్య వస్తే, దాన్ని ఒక పెద్ద అపశకునంగా భావిస్తారు. అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఆ రోజున రెండు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరాదని చెబుతూ వచ్చారు. ఆ రెండు వస్తువులు ఉప్పు మరియు నువ్వులు. ప్రతి ఇంట్లోను ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పును బయటికి ఇవ్వకూడదని చాలా కఠినంగా పాటిస్తారు. ఎవ్వరు అడిగినా సరే అస్సలు ఉప్పు ను గడప దాటనివ్వరు.
అలాగే నువ్వులను అమావాస్య రోజున కొనకూడదట . ఇది శనిదేవునికి సంబంధించినవిగా భావిస్తారు. ఆదివారం అమావాస్య నాడు నువ్వులు కొంటే, శనిదేవుని ఇంటికి ఆహ్వానించినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. తెలిసి కొన్నా తెలియక కొన్న..ఇది చాలా తలనొప్పులు ఇంటికి తీసుకొస్తుందని పండితులు చెప్తున్నారు. అలా చేస్తే ఇంటి ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని నమ్మకం ఉంది. అందుకే ఇప్పటికీ చాలామంది పెద్దలు ఈ ఆచారాన్ని నమ్ముతూ ఫాలో అవుతున్నారు. ఈ రెండే కాదు..చెప్పులు,చీపుర,చాట,కర్పూరం, మిరప్పొడి ఇలాంటి వి కూడా ఆదివారం అమావాస్య నాడు కొనకూడదట..!!
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కొంతమంది పండితులు చెప్పిన ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయం అని గుర్తుంచుకోండి..!!