నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు–ఒక ట్రావెల్ బస్సు మధ్య జరిగిన ఈ భయానక ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో డజనుకు పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చాలా మంది కంFఈషన్ క్రిటికల్ గా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి పాండిచ్చేరి వైపు ప్రయాణిస్తున్న మైత్రి ట్రావెల్స్‌కు చెందిన బస్సు 33 మంది ప్రయాణికులతో బయలుదేరింది.
 

అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న మూమెంట్ లో బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట ప్రాంతానికి చేరుకునేసరికి ఈ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ముందుగా బస్సు డ్రైవర్ ముందుకు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టగా, వెంటనే బస్సు వెనుక నుంచి వస్తున్న మరో లారీ బస్సును ఢీకొట్టింది. ఈ రెండు వరుస ఢీకొట్టుడుల వల్ల బస్సు ముందు–వెనుక భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అసలు గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయిపోయాయి.


ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో డజను మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మూడు అంబులెన్సుల సహాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆళ్లగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. బస్సు మరియు లారీని  పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదం తీవ్రత కారణంగా ప్రాంతంలోని ప్రజల్లో భారీ ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిద్ర మత్తులో ఆ డ్రైవర్ ఫాస్ట్ గా రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండచ్చు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: