హైదరాబద్ సిటీ కల్చర్ పెరిగింది.. దానితో పాటుగా హత్యలు, మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగాయి. అనడంలో ఎటువంటి సందేహం లేదు. తగ్గని హత్యలు, ఊపందుకున్న వ్యభిచారం జోరందుకున్నాయి. ఈ సందర్బంగా హైదరాబాద్ లో రోజుకో వ్యభిచారం గుట్టు రట్టు అవుతుంది.స్పా, సెలూన్‌ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న ఫ్లాట్‌పై కేపీహెబ్‌బీ పోలీసులు శనివారం రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేసి పలువురు యువతులకు విముక్తి కల్పించారు...

 

వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లికి చెందిన వెంపటి సతీష్‌ అనే వ్యక్తి కేపీహెచ్‌బీ కాలనీ ఆరో ఫేజ్‌లో గ్లోవెల్‌ ఫ్యామిలీ స్పా అండ్‌ సెలూన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. కస్టమర్లకు మసాజ్ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారిని ప్రలోభాలకు గురిచేసి వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం రాత్రి ఒక్కసారిగా స్పా సెంటర్లో తనిఖీలు చేశారు.

 

 

ఈ సందర్భంగా వ్యభిచారం చేస్తున్నా ముగ్గురు ఆడవాళ్ళను పట్టుకున్నారు..అయితే ఆ ముగ్గురితో ఉన్న మరో ఆరుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..సతీశ్‌, ఓ ఉద్యోగినితో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు. ముగ్గురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించి పునరావాస కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలంలో రూ. 1,13,450 నగదు, ఓ ల్యాప్‌టాప్‌, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

 

 

ఈ చాటు మాటు వ్యవహారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు..అయితే ఈ రోజు అయితే వ్యభిచారం అనేది ఇప్పుడు ఎక్కువగా వెలుగులోకి వచ్చింది.. అలా రోజుకో వ్యభిచార గృహం బయటకొస్తుంది..హైదరాబాద్ సిటీ కల్చర్ మారుతుంది.. అని అనుకుంటే.. ఇలాంటి బాగోతాన్ని బయటకొస్తుంది.. అందుకే క్రైమ్ రేటు కూడా పెరిగిపోతుంది.. చట్టాలు గట్టిగా ఉన్నా కూడా ఇలాంటి దర్శనమిస్తూ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: