దేశంలో ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర గుజరాత్ ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇక్కడ కరోనా కేసులు మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలకు క్యూబా నుంచి వైద్యులను దింపే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. క్యూబా నుంచి వైద్య బృందాన్ని దింపాలని కేంద్ర సర్కార్ భావిస్తుంది. త్వరలోనే క్యూబా నుంచి ప్రత్యేక విమానాల్లో వైద్యులు రానున్నారు. ముంబై సూరత్, చెన్నై నగరాల్లో వీళ్ళు తమ సేవలను అందిస్తారు. దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: